తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాబార్డ్.. సహకార సంస్థలను బలోపేతం చేస్తోంది' - నాబార్డ్ సహకార సంస్థలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాబార్డ్ ఛైర్మన్ గోవిందరాజులు పర్యటించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఓ గోదాం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

nabard-chairmen-visits-rajanna-siricilla
'నాబార్డ్..సహకార సంస్థలను బలోపేతం చేస్తోంది'

By

Published : Dec 19, 2020, 8:20 PM IST

దేశంలో ఏ బ్యాంకు చేయని విధంగా.. లాక్​డౌన్ ​లోనూ రూ. లక్షా 80 వేల కోట్లను నాబార్డ్, వ్యవసాయ రుణాల కింద కేటాయించిందని సంస్థ ఛైర్మన్ గోవిందరాజులు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఓ గోదాం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి టెస్కాబ్ ఛైర్మన్ కె. రవీందర్​తో కలసి ఆయన హాజరయ్యారు.

వ్యవసాయ, ఇతర రంగాల్లో ఉపాధి కోసం రూ.2 లక్షల కోట్ల రుణాలను కేటాయించి..సహకార సంస్థలను నాబార్డ్ బలోపేతం చేస్తోందని గోవిందరాజులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చిన్న తరహా రంగాల కోసం రూ. 5 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ​

ఇదీ చూడండి:ప్రొటోకాల్​ వివాదం మధ్య నాబార్డు ఛైర్మెన్ పర్యటన

ABOUT THE AUTHOR

...view details