తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్ నిషేధంపై వెరైటీగా మున్సిపల్ అధికారుల ధర్నా

వ్యాపారస్తులు ప్లాస్టిక్ సంచులు విక్రయించవద్దంటూ మున్సిపల్ అధికారులు దుకాణాల ఎదుట ఆందోళన చేశారు.

By

Published : Dec 9, 2019, 5:44 PM IST

muncipal
ప్లాస్టిక్ నిషేధించాలంటూ మున్సిపల్ అధికారుల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వ్యాపారస్తులు ప్లాస్టిక్ సంచులను విక్రయించవద్దంటూ మున్సిపల్ అధికారులు ధర్నా నిర్వహించారు. రాజన్న ఆలయం వద్ద పలు దుకాణాల్లో మున్సిపల్ కమిషనర్ టి. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ సంచులు వాడుతున్న వ్యాపారులపై జరిమానాలు విధించారు. పలువురు దుకాణదారులు ఎదురు తిరగడంతో వారి దుకాణాల ముందు సిబ్బందితో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత మూడు మాసాలుగా పట్టణంలో పురపాలక సంఘం నుంచి ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినా వ్యాపారస్తులు స్పందించడం లేదని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

ప్లాస్టిక్ నిషేధించాలంటూ మున్సిపల్ అధికారుల ధర్నా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details