తెలంగాణ

telangana

ETV Bharat / state

'కంటి తుడుపు చర్యలు కాదు... కఠిన శిక్షలు వేయాలి' - తెరాస ప్రభుత్వంపై బండి సంజయ్​ విమర్శలు

ఏదైనా ఓ ఘటన జరిగాక స్పందిచటం ఎంత ముఖ్యమో.... అది జరకుండా చర్యలు తీసుకోవటమూ అంతే ముఖ్యమని ఎంపీ బండి సంజయ్​ తెలిపారు. సిరిసిల్లలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఎంపీ... నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవటంపై మండిపడ్డారు.

MP BANDI SAJAYKUMAR COMMENTS ON SIRICILLA SC HOSTEL
MP BANDI SAJAYKUMAR COMMENTS ON SIRICILLA SC HOSTEL

By

Published : Feb 15, 2020, 5:49 PM IST

సిరిసిల్లలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో అమ్మాయిలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనను ప్రభుత్వం చిన్నదిగా చేసి చూపించి... కంటితుడుపు చర్యలు చేపడుతోందని ఎంపీ బండి సంజయ్​ ఆరోపించారు. హాస్టల్ సముదాయాన్ని సందర్శించిన ఎంపీ... జరిగిన ఘటన గురించి విద్యార్థులను అడిగితెలుసుకున్నారు. మౌళిక సౌకర్యాలను పరిశీలించారు.

విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారని, ఇంత పెద్ద ఘటన చోటుచేసుకున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్లు ఉండటం దారుణమని సంజయ్​కుమార్​ మండిపడ్డారు. ఇలాంటి కేసును నీరుగార్చేలా వ్యవహరించడం సరియైంది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

'కంటి తుడుపు చర్యలు కాదు... కఠిన శిక్షలు వేయాలి'

ఇవీ చూడండి:శంషాబాద్​లో 1100 గ్రాముల బంగారం పట్టివేత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details