తెలంగాణ

telangana

మిషన్​ భగీరథ పైప్​లైన్ లీక్... వృథాగా పోతున్న నీరు

ప్రజలు తాగడానికి నీరు లేక అల్లాడుతుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిపై మిషన్​ భగీరథ పైప్​లైన్ లీకై నీరు వృథాగా పోతోంది.

By

Published : Nov 10, 2019, 11:10 AM IST

Published : Nov 10, 2019, 11:10 AM IST

మిషన్​ భగీరథ పైప్​లైన్ లీక్... వృథాగా పోతున్న నీరు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారి మధ్యలో అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో మిషన్ భగీరథ పైప్​లైన్ లీకై నీరు వృథా పోతోంది. రెండు గంటలుగా నీరు ఎగిసి పడుతుండటంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాగడానికి నీరు లేక అల్లాడుతుంటే ఇలా నీరు వృథాగా పోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే బాగు చేయాలని కోరుతున్నారు.

మిషన్​ భగీరథ పైప్​లైన్ లీక్... వృథాగా పోతున్న నీరు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details