తెలంగాణ

telangana

ETV Bharat / state

కంటైన్మెంట్​ జోన్​ ప్రజలకు అండగా ఉంటాం: కేటీఆర్​

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కంటైన్మెంట్​ జోన్​లో మంత్రి కేటీఆర్​ పర్యటించారు. ఎవరూ అధైర్య పడొద్దని.. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

By

Published : Apr 15, 2020, 5:40 PM IST

minister ktr visited containment zone in rajanna siricilla district
కంటైన్మెంట్​ జోన్​లోని ప్రజలకు అండగా ఉంటాం: కేటీఆర్​

కంటైన్మెంట్ ​జోన్​లో నివసిస్తున్న ప్రజలంతా అధైర్య పడొద్దని.. అండగా ఉంటామని మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కంటైన్మెంట్​ జోన్​లో ఆయన పర్యటించారు. అధికారులు చేపట్టిన చర్యలపై ఆరా తీశారు.

నిత్యవసర సరకులు, అత్యవసర సేవల కోసం అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు కేటీఆర్​ సూచించారు. కొంతసేపు స్థానికులతో మాట్లాడారు... వారి సమస్యలపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారం కోసం కాల్​ సెంటర్​ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలని... కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

మంత్రి వెంట జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ, కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే ఉన్నారు.

కంటైన్మెంట్​ జోన్​లోని ప్రజలకు అండగా ఉంటాం: కేటీఆర్​

ఇవీచూడండి:రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్​ ఆకస్మిక పర్యటన

ABOUT THE AUTHOR

...view details