తెలంగాణ

telangana

ETV Bharat / state

కరెంట్​షాక్​తో వివాహిత మృతి - Married women died with Current shock in Rajanna siricilla district

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో విద్యుత్ షాక్​తో రేనా అనే వివాహిత మృతి చెందింది. ఆమె మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉపాధి కోసం గల్ఫ్​ దేశానికి వెళ్లిన భర్త లాక్​డౌన్​ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు.

Married women died with Current shock in Rajanna siricilla district
కరెంట్​షాక్​తో వివాహిత మృతి

By

Published : Apr 21, 2020, 10:49 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో విద్యుత్ షాక్​తో తవుటు రేనా అనే వివాహిత మృతి చెందింది. మంగళవారం ఉదయాన్నే మోటర్ ఆన్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్​తో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి భర్త రాజం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లినట్ల పేర్కొన్నారు.

కరోనా లాక్​డౌన్ కారణంగా రాజం అక్కడే ఉండిపోయాడు. భార్య మృతి చెందిన వార్త విన్న ఆయన... ఆమె మృతదేహాన్ని చరవాణిలో వీడియో కాల్ ద్వారా చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలికి కుమారుడు పవన్, కుమార్తె సౌమ్యలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details