KTR review meeting in RajannaSirisilla District: ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో మంజూరైన ఇళ్లను సాధ్యమైనంత త్వరగా గ్రౌండ్ చేయాలని అధికారులకు కేటీఆర్ ఆదేశించారు. లాటరీ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ఇళ్లను అర్హులకు కేటాయించాలన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందజేయాలని తెలిపారు.
ఇళ్లు పూర్తయ్యేలా.. చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. జిల్లాకు మంజూరైన 6886 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల నియోజకవర్గం మాదిరిగానే వేములవాడ, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలన్నారు. సంక్రాంతి పండగ లోగా ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో సంతృప్తి స్థాయిలో సిరిసిల్ల జిల్లాలో అన్ని మండలాల్లో ఇళ్లు కావలసినవారు ఎంత మంది ఉన్నారో.. లెక్కలు చెప్పాలన్నారు.