తెలంగాణ

telangana

ETV Bharat / state

ముంపు గ్రామంగా ప్రకటించాలని కలెక్టర్​కు వినతిపత్రం - కందికట్కూరు గ్రామం

ముంపు గ్రామంగా ప్రకటించాలని సిరిసిల్ల జిల్లా కందికట్కూరు గ్రామస్థులు కలెక్టర్​ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మిడ్​మానేరులోకి 11 టీఎంసీల నీరు చేరి తమ ఇళ్లు ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

ముంపు గ్రామం

By

Published : Aug 26, 2019, 7:21 PM IST

గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కలెక్టర్​కు వినతిపత్రం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరును ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామస్థులు ధర్నాకు దిగారు. కందికట్కూరు నుంచి పాదయాత్రగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. తమ ఊరిని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేశారు. మిడ్​మానేరులోకి 11 టీఎంసీల నీరు చేరడం వల్ల తమ ఇళ్లు అన్ని తేమగా మారి గోడలు ప్రమాదకరంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్​ కృష్ణ భాస్కర్​కు వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details