తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న సన్నిధికి భక్తుల తాకిడి - ARJITHA DARSHANAM

ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాజన్నకు ప్రీతిపాత్రమైన రోజైన సోమవారం రద్దీ పెరిగింది.

భక్తుల కిటకిట

By

Published : Mar 19, 2019, 12:07 AM IST

సోమవారం పర్వదినం సందర్భంగా రాజన్న ఆలయంలో భక్తుల సందడి
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో ఆలయంలోని ఆర్జిత సేవలు, శీఘ్ర దర్శనాలు రద్దు చేశారు. రద్దీ కారణంగా దర్శనానికి ఆరు గంటల సమయం పట్టింది.

ABOUT THE AUTHOR

...view details