తెలంగాణ

telangana

రాజన్న సిరిసిల్ల జిల్లా పురపీఠాలు దక్కించుకుంది వీరే..!

By

Published : Jan 27, 2020, 3:37 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు పురపాలిక ఛైర్మన్ల ఎన్నిక జరిగింది. వేములవాడకు రామతీర్థ మాధవి, సిరిసిల్లకు జిందం కళలు ఛైరపర్సన్స్​గా ఎన్నికయ్యారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పురపీఠాలు దక్కించుకుంది వీరే..!
రాజన్న సిరిసిల్ల జిల్లా పురపీఠాలు దక్కించుకుంది వీరే..!

రాజన్న సిరిసిల్ల జిల్లా పురపీఠాలు దక్కించుకుంది వీరే..!
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం మున్సిపల్ ఛైర్​పర్సన్​గా రామతీర్థం మాధవి ఎన్నికయ్యారు. 28 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో 16 స్థానాల్లో తెరాస 6, భాజపా 5, స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. తెరాస అభ్యర్థికి మద్దతుగా 22 మంది చేతులు ఎత్తి ఎన్నుకున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ బాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైస్ ఛైర్మన్​గా రాజేందర్​ను ఎన్నుకున్నారు.

అలాగే సిరిసిల్ల మున్సిపల్ ఛైర్​పర్సన్​గా జిందం కళ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉపాధ్యక్ష పదవికి తెరాస నుంచి మంచే శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 34 ఓట్లతో మంచే శ్రీనివాస్​.. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు శ్రీనివాస రావు, సమ్మయ్యలు ప్రకటించారు. అనంతరం తెరాస నాయకులు సిరిసిల్లలో గెలుపొందిన అభ్యర్థులతో కలిసి భారీగా ర్యాలీ నిర్వహించారు. టపాసులు కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details