తెలంగాణ

telangana

ETV Bharat / state

'అదనంగా విధించిన విద్యుత్​ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి' - vidhyuth bills

రాజన్న సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయం ముందు పౌరసంక్షేమ సమితి ఆధ్వర్యంలో సీపీఐ, అఖిలపక్ష నాయకులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. అదనంగా విధించిన విద్యుత్​ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

cpi leaders protest at cpi office in rajanna siricilla
'అదనంగా విధించిన విద్యుత్​ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి'

By

Published : Jun 22, 2020, 2:01 PM IST

అదనంగా విధించిన విద్యుత్​ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుతూ.. రాజన్న సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయం ముందు సీపీఐ, అఖిలపక్ష నాయకులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. లాక్​డౌన్​ నేపథ్యంలో 3 నెలలకు సంబంధించిన విద్యుత్​ బిల్లులను అధికారులు ఇష్టం వచ్చినట్లు తీసి.. అధిక బిల్లులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికంగా విధించిన విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్​ చేశారు. దీనితో పాటు సిరిసిల్లా సహకార విద్యుత్​ సరఫరా సంస్థను ట్రాస్స్కోలో ప్రభుత్వం విలీనం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:ఏనుగు నోటికి గాయం- టపాసులే కారణం?

ABOUT THE AUTHOR

...view details