తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా పేషెంట్ రోడ్డు మీదకి వచ్చి ఏం చేశాడంటే..

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి... తనకు వైరస్ సోకలేదంటూ ఆస్పత్రి నుంచి తప్పించుకున్నాడు. రోడ్డు మీదకు వచ్చి స్థానికులు, పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఆస్పత్రికి వెళ్లనంటూ హంగామా సృష్టించాడు. ఆ తర్వాత ఏమైందంటే..?

By

Published : Jul 22, 2020, 8:51 AM IST

corona-patient-hulchal-at-vemulawada-in-rajanna-siricilla-district
కరోనా పేషెంట్ రోడ్డు మీదకి వచ్చి ఏం చేశాడంటే..

కరోనా పేషెంట్ రోడ్డు మీదకి వచ్చి ఏం చేశాడంటే..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంగళవారం రాత్రి కరోనా పాజిటివ్​ వచ్చిన వ్యక్తి రోడ్డుపైకి వచ్చి హల్​చల్​ చేశాడు. స్థానికులు, పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

వేములవాడలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతడిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా... అక్కడినుంచి తప్పించుకుని వేములవాడ రాజన్న ఆలయం వద్దకు చేరుకున్నాడు. తనకు కరోనాలేదని హంగామా సృష్టించాడు.

ఆసుపత్రికి వెళ్లనంటూ స్థానికులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. పట్టణ సీఐ వెంకటేష్ అతడికి కౌన్సిలింగ్ చేశారు. అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్​​

ABOUT THE AUTHOR

...view details