రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను నిరసిస్తూ రాస్తారోకో - telangana news
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
![కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను నిరసిస్తూ రాస్తారోకో rajanna siricilla news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10058353-830-10058353-1609322785197.jpg)
'ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత'పై కాంగ్రెస్ రాస్తారోకో
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనతో కరీంనగర్-సిరిసిల్ల రహదారిపై గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీచూడండి:కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ లేఖ