తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రణబ్​ ముఖర్జీకి నివాళులు అర్పించిన కాంగ్రెస్​ నేతలు

బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నివాళులు అర్పించారు. స్థానిక గాంధీ చౌక్​లో ప్రణబ్​ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

By

Published : Sep 1, 2020, 1:17 PM IST

congress leaders tributes to pranab mukharji  rajanna sirisilla district
ప్రణబ్​ ముఖర్జీకి నివాళులు అర్పించిన కాంగ్రెస్​ నేతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్​ నేతలు నివాళులు అర్పించారు. స్థానిక గాంధీ చౌక్​లో ప్రణబ్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.

వారి కుటుంబ సభ్యులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

ABOUT THE AUTHOR

...view details