తెలంగాణ

telangana

ETV Bharat / state

లేగదూడపై చిరుత పంజా.. పెద్దపులిపై అనుమానం - లేగదూడను చంపేసిన చిరుత

పొలం వద్ద పశువుల పాకలో ఉన్న లేగదూడపై చిరుత పంజా విసిరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల తండాలో దాడి చేసి హతమార్చింది.

chirutha attack on legadhuda at maddimalla thanda in rajanna sircilla district
చిరుతదాడిలో మృతి చెందిన లేగదూడతో రైతు

By

Published : Feb 7, 2021, 7:32 PM IST

లేగదూడను చిరుత హతమార్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వీర్నపల్లి మండలం మద్దిమల్లతండాలో ఓ రైతుకు చెందిన లేగదూడపై దాడిచేసి హతమార్చింది. గ్రామానికి చెందిన మాలోత్ రమేశ్​ రోజూలాగే పొలం వద్ద పశువులపాకలో రెండు ఎద్దులు, లేగదూడను కట్టేసి ఇంటికి వచ్చాడు.

పెద్దపులిపై అనుమానం :

ఆదివారం పొలం వద్దకు వెళ్లి చూడగా లేగదూడ చనిపోయి ఉంది. ఈ దాడి పెద్దపులి చేసినట్లుగా రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా మద్దిమల్లతండా ఆటవీ ప్రాంతంలో పెద్దపులి తమ జీవాలను బెదిరింపులకు గురిచేయగా.. తాము కేకలు వేయడంతో పారిపోయిందని బండారీ మహేశ్ యాదవ్ తెలిపారు. నిరుపేద గిరిజన రైతు మాలోత్ రమేశ్​కు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని అటవీశాఖ అధికారులను కోరారు. పెద్దపులి, చిరుత బారి నుంచి తమ పశువులను కాపాడాలని మద్దిమల్లతండా, వీర్నపల్లి, రంగంపేట గిరిజన తండాల ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి :బరాబర్ పదేళ్లు నేనే ముఖ్యమంత్రి.. ఊహాగానాలపై కేసీఆర్ క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details