తెలంగాణ

telangana

ETV Bharat / state

అటెండర్​తో చెప్పులు తుడిపించుకున్న డీఎంహెచ్​ఓ - SRCL_DMHO_CHEPPU THUDICHINA_ATENDAR

ఆయనో జిల్లా వైద్య విభాగానికి బాస్. జిల్లా ఉన్నతాధికారైన డీఎంహెచ్​ఓ అటెండర్​తో చెప్పులు తుడిపించుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లిలో ఏర్పాటు చేసిన పీహెచ్​సీ సమావేశంలో భాగంగా ఈ దారుణం చోటు చేసుకుంది.

'చెప్పులపై క్యాండిల్ మరకలు... తుడిపించుకున్న డీఎంహెచ్​ఓ'
'చెప్పులపై క్యాండిల్ మరకలు... తుడిపించుకున్న డీఎంహెచ్​ఓ'

By

Published : Jan 5, 2020, 8:25 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలోని పీహెచ్​సీ సెంటర్​లో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎంహెచ్ఓ చంద్రశేఖర్... తన చెప్పులను అటెండర్​తో తుడిపించారు.

జిల్లాలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెప్పులు తుడుస్తున్న ఫోటోలు వైరల్​ అయ్యాయి. దీనిపై డీఎంహెచ్​ఓను వివరణ కోరగా, చెప్పులపై క్యాండిల్ మరకలు పడితే... చూడమన్నానని బదులిచ్చారు. ఇటీవల యువకులను చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు ఉన్నాతాధికారులు. మరి ఈ విషయంలో సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

ఇవీ చూడండి : పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి ఎర్రబెల్లి అసంతృప్తి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details