తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్లలో డిపోకే పరిమితమైన 65 ఆర్టీసీ బస్సులు - TSRTC WORKERS BUNDH AT RAJANNA SIRICILLA

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో 65 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

సిరిసిల్లలో డిపోకే పరిమితమైన 65 ఆర్టీసీ బస్సులు

By

Published : Oct 19, 2019, 8:53 AM IST

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన బంద్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు ఉదయాన్నే సిరిసిల్ల బస్ డిపో ముందు బస్సులను అడ్డుకొని ధర్నా చేశారు. డిపోలో ఉన్న 65 బస్సులను బయటకు రానీయకుండా అడ్డుపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ధర్నాతో బస్సులున్నీ డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ బంద్ కారణంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సిరిసిల్లలో డిపోకే పరిమితమైన 65 ఆర్టీసీ బస్సులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details