తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తి శ్రద్ధలతో వటసావిత్రి వ్రతం - పెద్దపల్లి జిల్లా తాజా వార్తలు

భర్త ఆయురారోగ్యాలతో జీవించాలని, పూర్ణ ఆయుష్కుడు కావాలని కోరుతూ... పెద్దపల్లి జిల్లా మంథనిలో మహిళలు భక్తిశ్రద్ధలతో 'వటసావిత్రి' వ్రతం చేశారు. ఏటా జ్యేష్ఠ మాసంలో వివాహితులైన స్త్రీలు ఈ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోందని... పురోహితులు తెలిపారు.

Womens performing Vata savitri vratam
పెద్దపల్లి జిల్లా మంథని వటసావిత్రి వ్రతాన్ని ఆచరించిన మహిళలు

By

Published : Jun 24, 2021, 2:05 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలో సౌభాగ్యం కోసం మహిళలు భక్తి శ్రద్ధలతో వటసావిత్రి వ్రతం ఆచరించారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కలకాలం సిరి సంపదలు, పాడి పంటలు వృద్ధి చెందుతాయని మహిళలు భావిస్తున్నారు. ఏటా జ్యేష్ఠ మాసంలో వివాహితులైన స్త్రీలు ఈ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోందని... పురోహితులు తెలిపారు.

పెద్దపల్లి జిల్లా మంథని వటసావిత్రి వ్రతాన్ని ఆచరించిన మహిళలు

పురాణాల ప్రకారం...

పూర్వం సతీ సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతున్ని మృత్యువు నుంచి కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ సమయంలో నారద మహర్షి ఉపదేశానుసారం వ్రతం ఆచరించి... భర్తను మృత్యువు నుంచి రక్షించుకుంటుంది. ఆ వ్రతమే వటసావిత్రి వ్రతమని పురాణాల్లో భక్తుల నమ్మకం. ఆ రోజునే... తెలుగింటి ఆడపడుచు ఏటా... తన భర్త ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారని పురోహితులు తెలిపారు.

వృక్షానికి పూజలు...

ఎంతో ప్రత్యేకత కలిగిన వట సావిత్రి వ్రతాన్ని... ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజున మహిళలు వారి ఆచారం ప్రకారం ఆచరిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో రావిచెట్టుకు, మరికొన్ని ప్రాంతాల్లో మర్రిచెట్టు దగ్గర మహిళలు కూర్చొని... ఆ వృక్షాన్ని అశ్వత్థ నారాయణునిగా భావించి... లక్ష్మీదేవి సహితంగా పూజలు నిర్వహిస్తారు. మరి కొన్ని ప్రాంతాల్లో శివపార్వతులుగా భావించి మొక్కుతున్నారు. చెట్టుకు ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని చుట్టి గౌరమ్మ పూజలు నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: High Court: ఠాణాలో మహిళ మృతిపై న్యాయ విచారణకు హైకోర్టు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details