తెలంగాణ

telangana

ETV Bharat / state

'మా భూములిచ్చాం.. మీరు ఉద్యోగాలివ్వండి'

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్​ఎఫ్​సీఎల్​ ఎరువుల కర్మాగారం ఎదుట సమీప గ్రామ ప్రజలు ధర్నా చేపట్టారు. పరిశ్రమ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు ఉద్యోగాలు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్​ చేశారు.

By

Published : Oct 30, 2019, 1:07 PM IST

భూములిచ్చాం... ఉద్యోగాలివ్వండి

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎరువుల కర్మాగారం నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని సమీప లక్ష్మీపురం, వీర్లపల్లి గ్రామాల నిర్వాసితులు కర్మాగారం ఎదుట ధర్నా నిర్వహించారు. రామగుండం ఆర్ఎఫ్​సీఎల్ ఎరువుల కర్మాగారం.. అవసరాల నిమిత్తం 1991లో లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుమారు రెండు వందల ఎకరాల భూమిని తీసుకుందని.. ఆ సమయంలో నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఎరువుల కర్మాగారం మూత పడిందని తిరిగి ఆర్ఎఫ్​సీఎల్ పేరుతో ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న క్రమంలో కనీసం తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సమీప గ్రామాల భూ నిర్వాసితుల కుటుంబాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఎరువుల కర్మాగారంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

భూములిచ్చాం... ఉద్యోగాలివ్వండి

ABOUT THE AUTHOR

...view details