పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఎక్లాస్పూర్లో విషాదం చోటు చేసుకుంది. 27 ఏళ్ల యువకుడు, గ్రామ రెవెన్యూ సహాయకుడు గువ్వల మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత రెండేళ్లుగా రెవెన్యూ అధికారులు జీతం ఇవ్వక పోవడం వల్లే, ఆర్థిక ఇబ్బందులు పెరిగి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని అన్న రాజశేఖర్ తెలిపారు. వీఆర్ఏ మృతితో పరిసర వాతావరణంలో విషాదం నెలకొంది.
రెండేళ్లుగా జీతం లేక వీఆర్ఏ ఆత్మహత్య - suicide
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామ వీఆర్ఏ మహేష్ తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

రెండేళ్లుగా జీతం లేక వీఆర్ఏ ఆత్మహత్య