గోదావరిఖని డిపోలో 24 గంటల నిరాహార దీక్ష - గోదావరిఖనిలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోలో ఆర్టీసీ కార్మికులు 24 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు.
గోదావరిఖనిలో ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష
27 రోజులుగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని పెద్దపల్లి జిల్లా ఆర్టీసీ ఐకాస నేతలు మండిపడ్డారు. గోదావరిఖని డిపోలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు భాజపా నాయకులు సహా పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : కుటుంబం సహా ట్యాంక్ ఎక్కిన కాంట్రాక్టర్