కరీంనగర్ శివారులో అల్గునూరు వంతెన పైనుంచి పడిన ఘటనలో మృతి చెందిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో సంతాపం తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
కానిస్టేబుల్ చంద్రశేఖర్కు పోలీసుల నివాళులు
కానిస్టేబుల్ చంద్రశేఖర్ మృతిపట్ల రామగుండం కమిషనరేట్లో సంతాపం తెలిపారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
కానిస్టేబుల్ చంద్రశేఖర్కు పోలీసుల నివాళులు
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో కానిస్టేబుల్ చంద్రశేఖర్ చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీపీ సత్యనారాయణ అన్నారు. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవీ చూడండి:మూడు వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం