గత రెండు దశాబ్దాలుగా అటవీ సంపదను కొల్లగొడుతూ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు గండికొడుతూ వస్తున్న ఎడ్ల శ్రీనివాస్పై ఎట్టకేలకు రామగుండం పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. రాష్ట్రంలో కలప స్మగ్లింగ్లో అతను తెలంగాణ వీరప్పన్గా ఎదిగాడు. 4 రాష్ట్రాల్లో కలపను అక్రమంగా రవాణా చేస్తూ అటవీ, పోలీస్ అధికారులకు చిక్కకుండా మాఫియా సామ్రాజ్యంను విస్తరించాడు. ఈ ముఠాను ఏప్రిల్ 9న రామగుడం పోలీసులు అరెస్టు చేశారు. ఇతనికి కొందరి రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కలప స్మగ్లర్ ముఠాను పట్టుకోవడానికి కృషిచేసిన పోలీస్ అధికారులకు రామగుండం సీపీ సత్యనారాయణ రివార్డులను అందజేశారు.
తెలంగాణ వీరప్పన్పై పీడీ యాక్ట్ నమోదు - Telangana Veerappan Arrested by Ramagundam Police
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలప స్మగ్లర్ తెలంగాణ వీరప్పన్గా పేరుపొందిన పొందిన ఎడ్ల శ్రీనివాస్ అలియాస్ పోతారం శ్రీనివాస్పై పీడీ యాక్ట్ కేసు నమోదైంది. అతని అనుచరులైన కుడుదల కిషోర్ కుమార్, కొరవెన మధుకర్పై కూడా కేసు నమోదు చేసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు.
![తెలంగాణ వీరప్పన్పై పీడీ యాక్ట్ నమోదు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3226338-27-3226338-1557325640665.jpg)
తెలంగాణ వీరప్పన్పై పీడీ యాక్ట్ నమోదు