పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రామగుండం మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్ తెలిపారు. మరో ఏడు రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. కొవిడ్ థర్డ్వేవ్ను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వ్యాక్సినేషన్ డ్రైవ్ - తెలంగాణ తాజా వార్తలు
కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని రామగుండం మున్సిపల్ కమిషన్ ఉదయ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పెద్దపల్లి జిల్లా వార్తలు
మొదట్లో అంతంతమాత్రంగా ఉన్నా.. ప్రస్తుతం వ్యాక్సిన్పై ప్రజల్లో అవగాహన పెరిగిందనన్నారు. రోజు రోజుకి టీకా వేసుకునే వారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. అందరికీ సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:Etela : అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధిచెబుతాం: ఈటల