పెద్దపల్లి జిల్లా మంథని మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కాటారం మండలాల నుంచి అనేక లారీలు అధిక సంఖ్యలో హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి. గత రెండు రోజులు నుంచి ఈ రహదారి మొత్తం లారీలతో నిండిపోయింది. రాకపోకలకు తీవ్ర ఇభ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్లపై ఉన్న గుంతలు చాలవన్నట్లు అధిక సంఖ్యలో వాహనాలు తిరగడంతో చాలా సమస్యలొస్తున్నాయి. చివరకు అంబులెన్స్లకు కూడా లారీల వల్ల దారి దొరకక నానా అవస్థలు పడుతున్నారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు
మహదేవపూర్, కాటారం మండలాల నుంచి వరంగల్ వైపు వెళ్లే ఇసుక లారీలను భూపాలపల్లి జిల్లా పాలనాధికారి ఆదేశాలతో మంథని వైపు మళ్ళించారు. అందువల్ల లారీలు అధిక సంఖ్యలో మంథని వైపు వస్తున్నాయి.మరో పక్కన మంథని పెద్దపల్లి రహదారి మరమ్మతులు జరుగుతుండటం వల్ల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక లారీల రాకపోకలను ఈ మార్గంలో అనుమతించడం లేదు.