తెలంగాణ

telangana

By

Published : Feb 8, 2020, 11:57 PM IST

ETV Bharat / state

కాలనీలోకి నీరు చేరిందని రాస్తారోకో.. శాంతింపజేసిన ఎమ్మెల్యే

గోదావరిఖనిలోని శాంతినగర్​ కాలనీ వాసులు రాస్తారోకో చేపట్టారు. రామగుండం ఎరువుల రసాయనాల కార్మాగారం నుంచి విడుదలయ్యే నీరు కాలనీలోకి వస్తుందని ఆందోళన చేశారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్​, నగర మేయర్​ అనిల్​ కుమార్​ సమాచారం అందుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.

కాలనీలోకి నీరు చేరిందని రాస్తారోకో.. శాంతింపజేసిన ఎమ్మెల్యే
కాలనీలోకి నీరు చేరిందని రాస్తారోకో.. శాంతింపజేసిన ఎమ్మెల్యే

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల రసాయనాల కర్మాగారం నుంచి నుంచి గోదావరిఖనికి వెళ్లే ప్రధాన రహదారిపై శాంతి నగర్ కాలనీ వాసులు రాస్తారోకో చేపట్టారు. పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించడం వల్ల సుమారు మూడు గంటలపాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎఫ్​సీఐ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఎఫ్​సీఐ నుంచి వచ్చే నీటిని ఇళ్లల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని స్థానికులు హెచ్చరించారు.

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నగర మేయర్ అనిల్ కుమార్​లు ఎఫ్​సీఐ యాజమాన్యాన్ని పిలిపించి వెంటనే నీరు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం శాంతినగర్​లోకి చేరిన వరద నీటిని పరిశీలించారు.

కాలనీలోకి నీరు చేరిందని రాస్తారోకో.. శాంతింపజేసిన ఎమ్మెల్యే

ఇవీ చూడండి:మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం

ABOUT THE AUTHOR

...view details