తెలంగాణ

telangana

ETV Bharat / state

మూగజీవాల దాహం తీర్చడానికి నీటితొట్టెలు - water pots for animals in godavarikhani

వేసవిలో మూగజీవాల దాహం తీర్చడానికి పెద్దపల్లి జిల్లా రామగుండం 33వ డివిజన్ కార్పొరేటర్ ముందుకొచ్చారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు.

water pots
water pots

By

Published : May 21, 2020, 10:39 AM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ పరిధిలోని 33వ డివిజన్​లో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. విజయమ్మ ఫౌండేషన్ సభ్యుడు సంజీవ్​ జన్మదినం సందర్భంగా మూగజీవాల దాహం తీర్చడానికి తొట్టెలు ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు.

విజయమ్మ ఫౌండేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలవాలని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దొంత ఫౌండేషన్ సభ్యులు సతీష్, మేదరి శ్రీనివాస్, మంథని శ్రీనివాస్, లెనిన్ యుగంధర్ పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details