తెలంగాణ

telangana

By

Published : Jun 28, 2020, 5:14 PM IST

ETV Bharat / state

దిల్లీలో పీవీ ఘాట్​ ఏర్పాటు చేయాలి : తెరాస

మంథనిలో తెరాస నేతలు పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలని కోరారు.

PVNR Ghat to be set up in Delhi Demanded by TRS leaders in Manthani, Peddapalli District
దిల్లీలో పీవీ ఘాట్​ను ఏర్పాటు చేయాలి : మంథని తెరాస నాయకులు

దేశ రాజధాని దిల్లీలో పీవీ నరసింహారావు ఘాట్​ను ఏర్పాటు చేయాలని మంథని తెరాస నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో పీవీ శత జయంతి వేడుకల సందర్భంగా స్థానిక తెరాస నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి... దేశాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపించిన మహనీయుడు పీవీ అని కొనియాడారు. ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పటికీ 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన గొప్ప వ్యక్తి, అపర చాణిక్యుడు పీవీ నరసింహారావు అని... ఆయన పాలనా కాలంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఇదీ చూడండి :తెలుగువారి ఠీవీ- మన పీవీ: 'ఈటీవీ భారత్'​ అక్షర నివాళి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details