తెలంగాణ

telangana

By

Published : Sep 17, 2020, 4:18 PM IST

ETV Bharat / state

మంథని పట్టణంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకులు

ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా మంథని పట్ఠణంలో భాజపా నాయకులు 70కిలోల కేక్​ను కట్​ చేసి వేడుకలు జరుపుకున్నారు. దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రధాని నిర్ణయాలే కారణమని కొనియాడారు.

prime minister birthday celebrations in peddapalli district
మంథని పట్టణంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకులు

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో భాజపా నాయకులు ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాని 70వ జన్మదిన సందర్భంగా 70 కిలోల భారీ కేక్​ను పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తాలో కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.మోదీ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరారు. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరుపుకోవాలి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.

కొవిడ్​-19 దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ముందుచూపుతో సమావేశాలు నిర్వహించి కఠినమైన నిర్ణయాలు తీసుకొని లాక్​డౌన్ నిర్వహించి.. దేశ భవిష్యత్తును, ఆర్థిక వ్యవస్థను ప్రజలను కాపాడుకున్నారని తెలిపారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు కరోనాతో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో భారతదేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కారణం నరేంద్ర మోదీ అని కొనియాడారు.

ఇవీ చూడండి: మోదీకి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details