తెలంగాణ

telangana

ETV Bharat / state

పోషన్​ అభియాన్​లో భాగంగా అంగన్​వాడీ టీచర్లకు అవగాహన - పెద్దపల్లిలో అంగన్వాడీ టీచర్లకు అవగాహన వార్తలు

పెద్దపల్లి జిల్లా నాగారం గ్రామంలో 'పోషన్​ అభియాన్​ 2020'లో భాగంగా జిల్లా సంక్షేమ అధికారి ఆకేశ్వర్​ పోషక తోటల పెంపకం పోషకాహారంపై అంగన్​వాడీ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా కార్యక్రమాన్ని అంగన్​వాడీ సెంటర్ల నుంచే ప్రారంభించాలని ఆకేశ్వర్​ అన్నారు.

poshan abhiyan 2020 awareness programme in peddapalli
పోషన్​ అభియాన్​లో భాగంగా అంగన్వాడీ టీచర్లకు అవగాహన

By

Published : Sep 26, 2020, 5:19 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామంలో 'పోషన్​ అభియాన్​ 2020'లో భాగంగా తోటల పెంపకం, పోషకాహారంపై కొండా లక్ష్మణ్​ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ కృషి విజ్ఞాన కేంద్రం రామగిరిఖిల్లా ఆధ్వర్యంలో పోషన్​ అభియాన్​ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అవగాహన సదస్సుకు హాజరైన అంగన్వాడీ టీచర్లు

ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా కార్యక్రమాన్ని అంగన్వాడి సెంటర్ల నుంచే ప్రారంభించాలని పెద్దపల్లి జిల్లా సంక్షేమ అధికారి ఆకేశ్వర్​ అన్నారు. నేటి ఆధునిక కాలంలో మనిషి అనేక రకాల రసాయనాలతో పిచికారి చేసిన కూరగాయాలను, ఆహారధాన్యాలను తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో కచ్చితంగా పెరటి తోటలు పెంచాలని సూచించారు. ఈ సెప్టెంబర్ నెలను పోషణ మాసంగా తీసుకుని ఆహార అలవాట్ల గురించి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని అంగన్వాడీ ఉద్యోగులకు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పెరటి తోటలో కాసిన కూరగాయలతో పౌష్టికాహారం అందించాలని సూచించారు.

ఇదీ చదవండిఃఅలర్ట్: బయటకు వెళ్తే.. గొడుగు తీసుకెళ్లడం మరవొద్దు..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details