తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేదలకు పోలీసుల ఆపన్నహస్తం - lockdown

లాక్​డౌన్​ నేపథ్యంలో నిరుపేదలను ఆదుకునేందుకు పోలీసులు కూడా ముందుకొస్తున్నారు. పెద్దపల్లి మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో మంథని సీఐ, సీఆర్​పీఎఫ్​ సిబ్బంది పేదలకు నిత్యావసర సరకులను అందజేశారు.

police distributed basic needs in peddapalli district
నిరుపేదలకు పోలీసుల ఆపన్నహస్తం

By

Published : Apr 27, 2020, 6:23 PM IST

మేముసైతం అంటూ పోలీసులు కూడా పేదలకు ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. మంథని సీఐ మహేందర్, సీఆర్​పీఎఫ్ సిబ్బందితో కలిసి అడవి సోమనపల్లి గ్రామంలో నిరుపేదలైన 80 మంది కుటుంబాలకు పది కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు శానిటైజర్లు, మాస్కులను అందజేశారు.
లాక్​డౌన్​ సందర్భంగా మంథని పోలీసులు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ నిరుపేదలను ఆదుకుంటున్నారు.

ఇవీ చూడండి: అక్కడి విద్యార్థులకు వైరస్​.. తబ్లీగీలే కారణం!

ABOUT THE AUTHOR

...view details