పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని సింగరేణి ఏరియా ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
బాధిత కుటుంబీలకు న్యాయం చేస్తాం..
బాధిత కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం తరఫున న్యాయం చేసి ఆదుకుంటామని ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు కార్మిక కుటుంబీకులకు భరోసా కల్పించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కమిటీ వేయాలని కోరారు. బాధ్యులపై సింగరేణి యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.