తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక హెచ్చరికలు లేవు.. మాస్కు లేకుంటే రూ.వెయ్యి కట్టాల్సిందే.! - fine if not wearing mask in peddapalli district

రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. శానిటైజేషన్​, మాస్కుల నిబంధనలు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో మాస్కులు ధరించకుండా బయటకు వచ్చిన వారిపై పెద్దపల్లి జిల్లా పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటివరకు హెచ్చరికలు, సూచనలతో సరిపెట్టిన పోలీసులు.. ఇప్పుడు కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు.

fine if not wearing mask
మాస్కు లేకుంటే జరిమానా

By

Published : Mar 31, 2021, 11:48 AM IST

రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న వేళ పెద్దపల్లి జిల్లా పోలీసులు ముందు జాగ్రత్తలపై దృష్టి సారించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 55మందిపై కేసు నమోదు చేశారు. వీళ్లంతా కోర్టులో రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క సుల్తానాబాద్‌ మండలంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు.. మాస్క్‌ లేకుండా తిరుగుతున్న దాదాపు 30 మందిపై కేసు నమోదు చేశారు.

ఇకపై హెచ్చరికలు లేవు..

మాస్కులు ధరించలేదని ఇప్పటివరకు అవగాహన, హెచ్చరికలతో సరిపెట్టిన పోలీసులు.. ఇకనుంచి వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ కేసుల ద్వారా ప్రజల్లోకి సందేశాన్ని తీసుకెళుతున్నామన్నారు. మాస్కు పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా కొందరిలో మార్పు రావడం లేదని, ఇలా చేయడం వల్లనైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నామని వెల్లడించారు.

నిబంధనలు తప్పనిసరి..

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ ఇటీవలే ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలపైనా ఆంక్షలు విధించింది. మాస్కులు ధరించని వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:'చెంచులపై దాడి అసత్యం.. ఘర్షణ జరిగింది లంబాడి తెగ వారితో'

ABOUT THE AUTHOR

...view details