యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. జీవితంలో ఎదగాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని మదర్ థెరెసా ఇంజినీరింగ్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మైనింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి గవర్నర్ తమిళిసై, జేఎన్టీయూ వైస్ ఛాన్సిలర్ జయేశ్ రంజన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న సాకారపు సాయిని ఆయన అభినందించారు.
యువత అత్యున్నతస్థాయికి ఎదగాలి: అదనపు కలెక్టర్ - peddapalli additional collector latest news
యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అందుకోసం అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
![యువత అత్యున్నతస్థాయికి ఎదగాలి: అదనపు కలెక్టర్ peddapalli additional collector visit mother teresa college](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9248419-480-9248419-1603200762015.jpg)
యువత జీవితంలో ఎదగాలి: అదనపు కలెక్టర్
1999లో కళాశాల స్థాపించిన నాటి నుంచి వినూత్నమైన కోర్సులను ప్రవేశ పెడుతున్నట్లు కాలేజీ నిర్వాహకులు అదనపు కలెక్టర్కు వివరించారు. 2020 విద్యా సంవత్సరంలో సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులకు ఎ.ఐ.సి.టి.ఈ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జేఎన్టీయూ అనుమతులు పొంది ఎంసెట్ కౌన్సిలింగ్లో ఉంచినట్లు తెలపగా.. అదనపు కలెక్టర్ సదరు కోర్సులను ఆవిష్కరించారు.
ఇదీ చూడండి.. నిర్మల్ను క్లీన్ సిటీగా మార్చేస్తాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి