అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పరస్పరం సమన్వయంతో పనిచేస్తే పట్టణంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక ప్రాంతంలోని 15 డివిజన్లలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'అందరి సమన్వయంతో సమస్యలు పరిష్కారమవుతాయి'
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. తమ ప్రాంతాలను పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేయాలని ఎంపీ తెలిపారు.
'అందరి సమన్వయంతో సమస్యలు పరిష్కారమవుతాయ్'
డివిజన్లలోని పలు సమస్యలను ప్రజలనడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ వంటివి స్వయంగా పరిశీలించారు. పట్టణాలను అందంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని.. దీనిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ అనిల్ కుమార్తో పాటు కమిషనర్ ఉదయ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:-అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్లో ఓ గ్రామం!