తెలంగాణ

telangana

ETV Bharat / state

'మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర సర్కారు కృషి'

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమ్మక్క- సారలమ్మ వద్ద ఉన్న గోదావరిలో రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలను మంత్రి కొప్పుల ఈశ్వర్​ ప్రారంభించారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని... చేపల పెంపకానికి ప్రోత్సాహం కల్పిస్తుందని మంత్రి తెలిపారు.

By

Published : Dec 13, 2020, 3:43 PM IST

minister koppula eshwar started state level Raft competition
minister koppula eshwar started state level Raft competition

కాళేశ్వరం ప్రాజెక్టు.. రాష్ట్రానికి వర ప్రదాయిని అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమ్మక్క- సారలమ్మ వద్ద ఉన్న గోదావరిలో రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలను మంత్రి ప్రారంభించారు. సముద్రంలో కలిసే నీటిని ఒడిసిపట్టి రాష్ట్రాన్ని నీటితో నిండుకుండలా చేసిన ఘనత సీఎం కేసీఆర్​దేనన్నాన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలతో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు.

మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని... చేపల పెంపకానికి ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. ఒకప్పుడు ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి చేపలను దిగుమతి చేసుకునే వారని... ఇప్పుడు ఆ అవసరమే లేదన్నారు. ప్రతి ఏటా తెప్పల పోటీలను నిర్వహించడం ఎంతో హర్షణీయమన్న మంత్రి... నిర్వాహకులను అభినందించారు. సాయంత్రం వరకు గోదావరి నదిలో తెప్పల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్​, సుంకె రవిశంకర్​ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మహిళా పోలీసుల సంఖ్య పెరగాలి: డీఐజీ సుమతి

ABOUT THE AUTHOR

...view details