ఇసుక లారీల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు ఆందోళన వ్యక్తం చేశారు. లారీ ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటనా స్థలాన్ని శ్రీధర్బాబు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
'ఇసుక లారీలు ఇటునుంచి ఎందుకు వెళ్తున్నాయ్?' - మంథని ఎమ్మెల్యే వార్తలు
లారీల మితిమీరిన వేగంపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటి లారీ ప్రమాద స్థలాన్ని పరిశీలించి... మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'ఇసుక లారీలు ఇటుగా ఎందుకు వెళ్తున్నాయ్?'
మంథని-పెద్దపల్లి రహదారిపై లారీలు మితిమీరిన వేగంతో వెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇసుక లారీలు భూపాలపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్నా.. మంథని నుంచి ఎందుకు అనుమతిస్తున్నారని శ్రీధర్బాబు ప్రశ్నించారు.