తెలంగాణ

telangana

ETV Bharat / state

నిద్రమత్తులో డ్రైవర్.. విద్యుత్​ స్తంభాలనును ఢీ కొన్న లారీ..

పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్​లోని రాజీవ్ రహదారిపై ఓ లారీ డ్రైవర్ నిద్రమత్తులో బీభత్సం సృష్టించాడు. అతివేగంగా లారీని నడుపుతూ మూడు విద్యుత్ స్తంభాలను.. ఒక భారీ వృక్షాన్ని ఢీ కొన్నాడు. ​

By

Published : Feb 12, 2020, 10:36 AM IST

lorry accident in peddapalli
నిద్రమత్తులో డ్రైవర్.. విద్యుత్​ స్తంభాలనును ఢీ కొన్న లారీ..

విశాఖపట్నం నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వైపు వెళ్తున్న లారీ సుల్తానాబాద్ వద్ద మూడు విద్యుత్​ స్తంభాలను ఒక భారీ వృక్షాన్ని ఢీకొని ఆగింది. డ్రైవర్​ నిద్రమత్తులో ఉండి అతివేగంగా లారీ నడపడం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.

ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్​కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా నిరంతరం రద్దీగా ఉండే రాజీవ్​ రహదారిపై రాకపోకలకు భారీ అంతరాయం ఏర్పడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సుల్తానాబాద్​ పోలీసులు ట్రాఫిక్​ను నియంత్రించారు. లారీ డ్రైవర్​పై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిద్రమత్తులో డ్రైవర్.. విద్యుత్​ స్తంభాలనును ఢీ కొన్న లారీ..

ఇదీ చూడండి: భారీగా అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న లారీ సీజ్

ABOUT THE AUTHOR

...view details