పెద్దపల్లి జిల్లా మంథనిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. పర్వదినాన సందడిగా ఉండాల్సిన ఆలయ పరిసరాలు.. భక్తులు లేక బోసిపోయి కనిపించాయి. రాష్ట్రంలో రెండు రోజులుగా పెరిగిన చలి ఓ కారణం కాగా.. కొవిడ్ నేపథ్యంలో ఆలయాలకు భక్తుల తాకిడి తగ్గుముఖం పట్టింది.
వైకుంఠ ఏకాదశి నాడు బోసిపోయిన దేవాలయాలు - hindu temples
ముక్కోటి ఏకాదశి వేడుకల్లో కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. పండగపూట భక్తులు లేక దేవాలయాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
![వైకుంఠ ఏకాదశి నాడు బోసిపోయిన దేవాలయాలు less devotes visit temples on tholi ekadashi festival](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10005187-142-10005187-1608898460443.jpg)
తొలిఏకాదశి నాడు బోసిపోయిన దేవాలయాలు
స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో జరిగే ఉత్సవాలకు ప్రతీ యేటా లక్షలాదిగా భక్తులు తరలివచ్చేవారు. కరోనా మహమ్మారి భయంతో ఈసారి దేవుడిని దర్శించుకోనేవారి సంఖ్య భారీగా తగ్గినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:వైకుంఠ ఏకాదశి పర్వదిన విశిష్టత తెలుసా...?