సింగరేణి సంస్థ 132వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. జీఎం కల్వల నారాయణ పాల్గొని సింగరేణి జెండా ఆవిష్కరించారు. జీఎంతో పాటు కార్మిక నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
కొవిడ్ కారణంగా..
సంస్థ నిర్దేశించిన మేరకు బొగ్గు ఉత్పత్తి చేయలేకపోయామని జీఎం నారాయణ తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే గనులలో కార్మికుల హాజరు శాతం పెరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సంస్థ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటామని చెప్పారు.