తెలంగాణ

telangana

By

Published : Aug 14, 2020, 5:46 AM IST

ETV Bharat / state

మొక్కలు ధ్వంసమైనందుకు రూ.50 వేల జరిమానా

హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ధ్వంసం చేసింనందుకు గానూ... ఏకంగా రూ.50 వేల జరిమానా వసూలు చేశారు అటవీ శాఖ అధికారులు. ఈ ఘటన పెద్దపల్లి పాలకుర్తి మండలం అప్పనపేటలో జరిగింది.

మొక్కలు ధ్వంసమైనందుకు రూ.50 వేల జరిమానా
మొక్కలు ధ్వంసమైనందుకు రూ.50 వేల జరిమానా

పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం అప్పనపేటలో హరితహారం మొక్కలు ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులపై అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి రూ.50 వేల జరిమానా విధించారు. కట్నాపల్లి నుంచి గోదావరిఖని కోల్​బెల్ట్ వంతెన వరకు రాజీవ్ రహదారికి ఇరువైపులా అధికారులు మొక్కలు నాటారు.

ఇటీవల అప్పనపేట వద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్లు అయిన స్వామి, రాజేశం... ట్రాక్టర్లు, టిప్పర్ లారీతో రోడ్డు పక్కన పెరిగిన మొక్కలను ధ్వంసం చేశారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి, జరిమానా వసూలు చేశారు. హరితహారం మొక్కల ధ్వంసానికి ఎవ్వరు పాల్పడినా.... కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీఎఫ్​ఓ రవి ప్రసాద్ హెచ్చరించారు.

ఇవీ చూడండి:అమ్మలా ఆదుకుంటాయనుకున్న ఆశ్రమాలే... అత్యాచారాలకు నిలయాలుగా...

ABOUT THE AUTHOR

...view details