ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి శ్రీపాదరావు 83వ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీపాద చౌక్, రావుల చెరువు కట్టలోని శ్రీపాదరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
శ్రీపాదరావు జయంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి శ్రీపాదరావు 83వ జయంతి వేడుకలు
పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి శ్రీపాదరావు 83వ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
![శ్రీపాదరావు జయంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ sripada rao janthi celebrations in manthani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6266005-154-6266005-1583138842314.jpg)
శ్రీపాదరావు జయంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ
మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. శ్రీపాద కాలనీ లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని నాయకులు తెలిపారు.
శ్రీపాదరావు జయంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ
ఇవీ చూడండి:భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య