పట్టణంలోని సప్తగిరి కాలనీ, శివనగర్, అడ్డగుంట పల్లి తదితర కాలనీల్లో రోడ్లన్నీ దారుణంగా తయారై.. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. బురద గుంటలో బస్సులు, ఆటోలు పడి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రామగుండం నగరపాలక సంస్థలోని ప్రధాన రోడ్లకు మరమ్మతులు చేసి.. ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
బురదమయంతో రామగుండం రహదారులు - ప్రజాప్రతినిధులు
పేరుకే రామగుండం నగరపాలక సంస్థ. అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరం. కార్పొరేషన్లో వివిధ పన్నులు క్రమం తప్పకుండా వసూలు చేస్తారు. ఇవ్వకుంటే నోటీసులతో పాటు ఇళ్లకు తాళాలు వేసే అంత వరకు వదిలిపెట్టరు. కానీ పట్టణాల్లోని రహదారులను మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రామగుండం నగరపాలక ప్రాంతంలోని 50 డివిజన్లో దాదాపు రోడ్లన్నీ పొలాలను తలపిస్తున్నాయి.

బురదమయంతో రామగుండం రహదారులు
బురదమయంతో రామగుండం రహదారులు
ఇవీ చూడండి : అరకొర వసతులతో అంగన్వాడీ కేంద్రాలు