తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యావసరాలు పంపిణీ చేసిన కార్పొరేటర్ లతా దామోదర్

రామగుండం మున్సిపాలిటీ 13వ డివిజన్​లో నివాసముంటున్న నిరుపేద కుటుంబాలకు కార్పొరేటర్ లతా దామోదర్ బియ్యం, నిత్యావసరాలు అందించి తమ ఉదారతను చాటుకున్నారు.

By

Published : Apr 10, 2020, 3:48 PM IST

corporater latha damodar distributed food items and corona kit at ramagundam municipality peddapalli
నిత్యావసరాలు పంపిణీ చేసిన కార్పొరేటర్ లతా దామోదర్

పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలికలోని 13వ డివిజన్ కార్పొరేటర్ లతా దామోదర్ ఆధ్వర్యంలో రేషన్ కార్డు లేని 25 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మాస్కులు, శానిటేషన్లు పంపిణీ చేశారు. లాక్​డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన పేదల కడుపు నింపేందుకు ముందుకొచ్చిన డివిజన్ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న రోజుల్లోనూ పేద కుటుంబాల ఆకలి బాధలు తీర్చేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి:జనహితం కోసం జాతీయ వ్యూహం: కిషన్​ రెడ్డి

For All Latest Updates

TAGGED:

tg

ABOUT THE AUTHOR

...view details