పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలికలోని 13వ డివిజన్ కార్పొరేటర్ లతా దామోదర్ ఆధ్వర్యంలో రేషన్ కార్డు లేని 25 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మాస్కులు, శానిటేషన్లు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన పేదల కడుపు నింపేందుకు ముందుకొచ్చిన డివిజన్ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన కార్పొరేటర్ లతా దామోదర్
రామగుండం మున్సిపాలిటీ 13వ డివిజన్లో నివాసముంటున్న నిరుపేద కుటుంబాలకు కార్పొరేటర్ లతా దామోదర్ బియ్యం, నిత్యావసరాలు అందించి తమ ఉదారతను చాటుకున్నారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన కార్పొరేటర్ లతా దామోదర్
రానున్న రోజుల్లోనూ పేద కుటుంబాల ఆకలి బాధలు తీర్చేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి:జనహితం కోసం జాతీయ వ్యూహం: కిషన్ రెడ్డి
TAGGED:
tg