తెలంగాణ

telangana

ETV Bharat / state

మంథనిలో కరోనా నిర్ధరణ పరీక్షల కోసం పడిగాపులు - మంథనిలో కరోనా నిర్ధరణ పరీక్షలు

కరోనా నిర్ధరణ పరీక్షల కోసం రోజుల తరబడి వేచి చూస్తున్నామని... ఇలా వేచినప్పుడే వైరస్ సోకుతుందేమో అనే భయం వేస్తుందని మంథనిలో కొవిడ్​ అనుమానితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలమేరకే నిర్ధరణ పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు.

corona confirmation tests in manthani
మంథనిలో కరోనా నిర్ధరణ పరీక్షల కోసం పడిగాపులు

By

Published : May 22, 2021, 12:27 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు కరోనా నిర్ధరణ పరీక్షల కోసం ప్రజలు తరలివచ్చారు. రెండు రోజులుగా వైద్యశాలలో తక్కువమందికే నిర్ధరణ పరీక్షలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికే రోజులు గడిచిపోతున్నాయని వాపోయారు.

ఉదయం ఆరు గంటల నుంచి కరోనా అనుమానిత ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గంటల తరబడి వేచి ఉండలేక చెప్పులను, ఇతర వస్తువులను వరుసక్రమంలో పెట్టి.. అక్కడ పరిసర ప్రాంతాల్లో సామాజిక దూరం పాటిస్తూ పడిగాపులు కాస్తున్నారు. ఇలా ఎక్కువసేపు వేచి ఉండడం వల్ల కరోనా వచ్చే ప్రమాదముందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిర్ధరణ పరీక్షలు చేసిన తర్వాత గ్రామాలకు వెళ్లాలంటే లాక్​డౌన్ వల్ల ప్రయాణించేందుకు వాహనాలు దొరకట్లేదని.. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

మంథనిలో కరోనా నిర్ధరణ పరీక్షల కోసం పడిగాపులు

ప్రభుత్వం రోజువారీగా నిర్ధరణ కిట్లను సరఫరా చేస్తుందని.. కిట్లు వచ్చిన తర్వాతే పరీక్షలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని... ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే చేస్తున్నామని తెలిపారు. వైద్యులు నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన అనుమానితులను వారి లక్షణాలను అడిగి తద్వారా కరోన టెస్టుల కోసం అనుమతి ఇస్తున్నారు.

ఇదీ చూడండి:నగర, పురపాలికల్లో హోంకంపోస్టింగ్ విభాగం

ABOUT THE AUTHOR

...view details