పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్న ట్రాక్టర్లను టాస్క్ఫోర్స్ పోలీసుల పట్టుకున్నారు. సిద్దపల్లి నుంచి మంథనికి తరలిస్తున్నరన్న సమాచారంతో... శనివారం తెల్లవారుజామున దాడి చేసి ట్రాక్టర్లు, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 26వేల విలువైన 8టన్నుల బొగ్గు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, 2 ట్రాక్టర్లను సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మంథని ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు.
అక్రమ బొగ్గు రవాణా వాహనాల సీజ్ - coal illeagal transport vehicles seaz in manthani
అక్రమంగా బొగ్గు తరలిస్తున్న ట్రాక్టర్లను పెద్దపల్లి జిల్లా మంథని పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు.
![అక్రమ బొగ్గు రవాణా వాహనాల సీజ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5157407-thumbnail-3x2-seez.jpg)
అక్రమ బొగ్గు రవాణా వాహనాల సీజ్