తెలంగాణ

telangana

By

Published : Jun 10, 2021, 3:09 PM IST

ETV Bharat / state

కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ ఆందోళన

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను (anti-labor policies) నిరసిస్తూ.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఐటీయూ నేతలు ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్​ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ.. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

anti-labor policies
anti-labor policies

ఫ్రంట్ లైన్ వారియర్స్​గా పనిచేస్తోన్న కార్మికులందరికీ వెంటనే కొవిడ్​ టీకాలను అందించాలంటూ.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను (anti-labor policies) నిరసిస్తూ.. అంబేడ్కర్​ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కార్మికులందరికీ రూ. 50 లక్షల ప్రమాద బీమాను కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:Attack: పోలీసునని చెప్తున్నా వినకుండా కానిస్టేబుల్‌పై దాడి

ABOUT THE AUTHOR

...view details