పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మూర్మూర్లోని మిషన్ భగీరథ నీటిశుద్ధి కేంద్రంలో క్లోరిన్ గ్యాస్ సిలండర్ లీక్ అయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆరుగురు కార్మికులతో పాటు సూపర్ వైజర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
భగీరథ కేంద్రంలో గ్యాస్ లీక్.. కార్మికులకు అస్వస్థత - భగీరథ కేంద్రంలో గ్యాస్ లీక్.
పెద్దపల్లి జిల్లా మూర్మూర్ గ్రామంలోని మిషన్ భగీరథ నీటిశుద్ధి కేంద్రంలో క్లోరిన్ గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. అందులో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులతో పాటు సూపర్ వైజర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
![భగీరథ కేంద్రంలో గ్యాస్ లీక్.. కార్మికులకు అస్వస్థత chlorine gas pipes are leaked and six members fall unconsious in mission bhageeratha water plant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5284028-thumbnail-3x2-gas.jpg)
గమనించిన స్థానికులు కార్మికులను గోదావరిఖని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గోదావరి నుంచి నీటిని మోటార్ల ద్వారా పంప్హౌజ్లోకి తరలించిన తర్వాత ఆ నీటిలో క్లోరిన్ను కలుపుతారు. ఈ క్రమంలో సిలిండర్లోని క్లోరిన్ నీటిలో కలుపుతుండగా ఒక్కసారి గ్యాస్ లీకై, అక్కడై విధులు నిర్వహిస్తున్న వారు స్పృహ తప్పి పడిపోయారు.
పంప్హౌజ్కు రెండు కిలోమీటర్ల మేర గ్యాస్ వ్యాపించడం వల్ల గోదావరిఖని అగ్నిమాపక సిబ్బంది చేరుకుని గ్యాస్ లీకేజీని ఆరికట్టారు. అధికారులు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. వెంటనే అధికారులపై చర్యలు తీసుకుని, కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : ఆరోగ్యశ్రీకి బదులు ఆయుష్మాన్ భారత్...!