కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, మాన్సుఖ్ లక్ష్మణ్భాయ్ మాంధవ్యా పెద్దపల్లి జిల్లా రామగుండం చేరుకున్నారు. ఎరువుల కర్మాగారాన్ని సందర్శించేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇరువురు మంత్రులు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. ముందుగా రామగుండం ఎరువుల కార్మాగారాన్ని సందర్శించి... అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు.
రామగుండం చేరుకున్న కేంద్రమంత్రులు - కిషన్రెడ్డి పర్యటన
కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, మాంధవ్యా రామగుండం చేరుకున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రామగుండానికి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లారు. కర్మాగారం సమస్యలు, అభివృద్ధి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు.
![రామగుండం చేరుకున్న కేంద్రమంత్రులు రామగుండం ఎరువుల కార్మాగార సందర్శనకు కేంద్రమంత్రులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8772686-398-8772686-1599890225567.jpg)
రామగుండం ఎరువుల కర్మాగార సందర్శనకు కేంద్రమంత్రులు
ఈ క్రమంలోనే ఆర్ఎఫ్సీఎల్ వద్ద ఎంపీ బోర్లకుంట వెంకటేశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆందోళనకు దిగారు. ఆర్ఎఫ్సీఎల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:ఏపీ నుంచి రైల్లో సిమెంటు ముడిసరుకు.. ఇదే తొలిసారి అంటున్న దక్షిణ మధ్య రైల్వే!