తెలంగాణ

telangana

By

Published : Jan 19, 2020, 1:06 PM IST

ETV Bharat / state

'బోధన్​ పురపాలికలో ఎంఐఎం అభ్యర్థులనే గెలిపించండి'

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పురపాలక సంఘం పరిధిలో ఎంఐఎం ఎన్నికల భారీ ప్రచార సభ నిర్వహించింది. సభకు హాజరైన పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు.

ఎంఐఎం అభ్యర్థులకే ఓటేయండి : ఓవైసీ
ఎంఐఎం అభ్యర్థులకే ఓటేయండి : ఓవైసీ

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎంఐఎం ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల భారీ బహిరంగ ప్రచార సభ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22న జరగనున్న పుర ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులకే ఓటేసి గెలిపించాలని కోరారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్, నిజామాబాద్ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఎన్ఆర్​సీని ప్రవేశపెట్టి ముస్లింల స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎంఐఎం అభ్యర్థులకే ఓటేయండి : ఓవైసీ

ఇవీ చూడండి : చేతులెత్తే విధానంలో ఛైర్ పర్సన్ల ఎంపిక?

ABOUT THE AUTHOR

...view details